సీగల్ పక్షులు. వీటి గురించి భారతీయులకు పెద్దగా తెలియక పోవచ్చు కానీ.
విదేశీయులకు బాగా తెలుసు.ఎందుకంటే మన దగ్గర పావురాలు ఎంత ఎక్కువుగా కనిపిస్తాయో.
విదేశాల్లో సీగల్ పక్షులు కూడా అంత ఎక్కువుగా కనిపిస్తాయి.కానీ మన దేశాల్లో పావురాలకు మనం మేత వేస్తె తింటాయి.
లేకపోతే మనం బయట ఏమైనా ఎడబెడితే వాటిని తింటాయి.
కానీ సీగల్ పక్షులు అలా కాదు.
చూడడానికి చాలా అందంగా ఉండే ఈ పక్షులు సముద్రంపై ఎక్కువుగా కనిపిస్తాయి.సముద్రంలో దొరికే చిన్న చిన్న పురుగులను, చేపలను ఆహారంగా తింటూ బతుకుతాయి.
కానీ ఈ మధ్య ఈ సీగల్ పక్షులు రూటు మార్చి నట్టు కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఇదివరకు లాగా సముద్రంపై దొరికే వాటిని ఆహారంగా మార్చుకోకుండా ఆహారం కోసం మనుషుల మీద దాడి చేస్తున్నాయి.
వీటి వల్ల విదేశీయులు చాలా బాధలు పడుతున్నారు.ఇక పరిస్థితులు చేయిదాటే ప్రమాదం ఏర్పడుతుంది.తాజాగా ఒక వ్యక్తిపై సీగల్ పక్షులు దాడి చేయడం వల్ల గాయపడే పరిస్థితి వచ్చింది.సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన మొత్తం రికార్డ్ అయ్యింది.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వ్యక్తి కె ఎఫ్ సి రెస్టారెంట్ దగ్గర తనకు కావలసినది కొనుక్కుని తింటుంటే ఈ ఘటన చోటు చేసుకుంది.
అతడు ఒక వ్రాప్ కొనుక్కుని బయటకు వచ్చి తింటూ ఉండగా సరిగ్గా అప్పాయుడే ఒక సీగల్ పక్షి దూసుకు వచ్చి అతడు తింటున్న వ్రాప్ ను ఎత్తుకు పోయేందుకు ట్రై చేసింది.దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.అక్కడ ఉన్న కెమెరాల్లో ఈ దృశ్యం అంతా రికార్డ్ అవ్వడంతో ఈ వీడియోను టిక్ టాక్ లో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.