రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 2022 సీజన్లో అంత గొప్పగా బ్యాటింగ్ చేయడం లేదు.ఈ సీజన్లో కోహ్లి రెండుసార్లు 40కి పైగా స్కోర్ చేశాడు కానీ ఇంకా హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా 12 పరుగులకే రనౌట్ అయ్యాడు.అయితే, బ్యాట్ తో టీమ్ కి సహకరించలేకపోయినా ఫీల్డింగ్ లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచి జట్టుకు విజయాన్ని అందించాడు.
గేమ్ను మలుపుతిప్పేలా ఓ క్యాచ్ను కోహ్లి ఒంటిచేత్తో అద్భుతంగా పట్టుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆర్సీబీ టీమ్ 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగా.
ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 173 పరుగులకే చేయగలిగింది.దీంతో కొద్దిలో ఇది ఒక మ్యాచ్ ని కోల్పోయింది.
నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఈ మ్యాచ్లో గెలిచి ఉండేది.కానీ విరాట్ కోహ్లీ డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ని కీలక సమయంలో అద్భుతంగా క్యాచ్ ఔట్ చేశాడు.16వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ వేసిన మొదటి రెండు బంతుల్లో 8 పరుగులు వచ్చాయి.ఈ సమయానికి 22 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉంది.
రిషబ్ పంత్ దూకుడు బ్యాటింగ్ తో ఈ రన్స్ అవలీలగా సాధించేలా కనిపించాడు.
మూడో బంతికి సిరాజ్ ఫుల్ టాస్ను బౌల్ చేయగా దాన్ని రిషబ్ పంత్ కవర్ సైడ్ కొట్టాడు.అది కచ్చితంగా బౌండరీ అవుతుందని అందరూ భావించారు.కానీ కవర్ సైడ్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ దానిని ఎగిరి మరీ ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు.
దీంతో డీసీ టీమ్ ఆశలన్నీ ఆవిరి అయ్యాయి.అయితే ఈ క్యాచ్ పట్టిన తరువాత విరాట్ కోహ్లీ మైదానంలో సెలబ్రేషన్స్ చేసుకుంటూ సందడి చేశాడు.
ఈ సమయంలో కోహ్లి భార్య అనుష్క శర్మ స్టాండ్స్లో ఉంది.ఈ ముద్దుగుమ్మ తన భర్త మైదానంలో పట్టిన స్టన్నింగ్ క్యాచ్ చూసి ఫిదా అయ్యింది.
కోహ్లీ కూడా అనుష్క వైపు చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.అతను ‘V’ గుర్తును భార్యకు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు.
దీంతో అనుష్క కూడా ఆనందంతో తన భర్త ప్రతిభను పొగిడింది.దీనికి సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.