ఉదయ్ కిరణ్.తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన యువ కిరణం ఉదయ్ కిరణ్.
అప్పటికే చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లాంటి హీరోలు అగ్రహీరోలు గా కొనసాగుతున్న సమయంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమై వరుస విజయాలతో ఒక్కసారిగా తెలుగు తెరపై ప్రేక్షకులుచూపులు ఆకర్షించిన హీరో ఉదయ్ కిరణ్.డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్.
ఇక ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్.యూత్ అందర్నీ కూడా ఊహించని రేంజిలో ఆకర్షించింది ఈ సినిమా.
ఇక ఇక 100 రోజులపాటు ఎంతో విజయవంతంగా ఆడింది ఈ సినిమా.కానీ ఇక శతదినోత్సవ వేడుకలు మాత్రం జరగలేదు.ఆ తర్వాత నువ్వు నేను అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు ఉదయ్ కిరణ్.అయితే ఈ సినిమా సమయంలో దినోత్సవ వేడుకలకు ఉదయ్కిరణ్ కాస్త ఆలస్యంగా వచ్చారు.
దీంతో డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ మధ్య వివాదం కొనసాగుతోంది అన్న దానికి ఆజ్యం పోసినట్లయింది.అంతేకాకుండా ఉదయ్ కిరణ్ స్క్రిప్టులో అతిగా కలుగ చేసుకుంటున్నారు అంటూ అప్పట్లో ఎన్నో పుకార్లు కూడా వచ్చాయి.
అయితే ఈ విషయంపై స్పందించిన ఉదయ్ కిరణ్.స్క్రిప్ట్ బాగా లేదు అనిపించింది అందుకే కొన్ని సలహాలు ఇచ్చాను అందులో తప్పేముంది అంటూ మీడియా ముందు చెప్పేశాడు.ఇక ఉదయ్ కిరణ్ నటించిన మూడు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.దీంతో అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోల నుంచి బెదిరింపులు కూడా మొదలయ్యాయి అనే వార్తలు కూడా హల్చల్ చేసాయ్.
అప్పట్లో ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు మంచి హిట్ టాక్ వచ్చినప్పటికీ ఫ్లాప్ అంటూ కొంతమంది ప్రచారం చేసేవారు అన్న వార్తలు కూడా వినిపించాయి.ఇలా ఉదయ్ కిరణ్ అగ్రహీరోగా ఎదగకుండా ఉండడానికి ఎంతో మంది ఇబ్బందులు సృష్టించారని చర్చించుకునేవారు.
ఆ తర్వాత తాను నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో మనస్థాపంతో చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ కిరణ్.