ప్రస్తుత సమాజంలో చిన్నచిన్న కారణాలకే హత్యలు చేయడం సర్వసాధారణంగా మారుతోంది.ఎవరిని నమ్మాలో.
ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల మధ్య మనమంతా జీవిస్తూ ఉన్నాం.మనిషిలో రోజురోజుకు మానవత్వం నశిస్తూ అడవిలో ఉండే మృగాల కంటే హీనంగా, విచక్షణ రహితంగా జీవిస్తున్నాడు.
ఆస్తికోసం, ప్రేమ కోసం, పగ ప్రతికారాల కోసం దారుణమైన హత్యలు చేస్తూ చివరికి తమ జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు కొందరు మూర్ఖులు.ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన ఏలేశ్వరం ( Eleshwaram )పట్టణంలో చోటు చేసుకుంది.
స్నేహితుడే యమపాశంగా మారి దారుణంగా హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
వివరాల్లోకెళితే.
ఏలేశ్వరం పట్టణానికి చెందిన మణికంఠ, బంటు దుర్గాప్రసాదులు ప్రాణ స్నేహితులు.ఆదివారం అర్ధరాత్రి దాదాపుగా 11-12 గంటల సమయంలో దుర్గాప్రసాద్( Durgaprasad ) తన కారులో మణికంఠను తీసుకొని బయటకు వెళ్ళాడు.
మణికంఠ ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో మణికంఠ తండ్రి శ్రీనివాసరావు తెల్లవారుజామున తన బంధువులతో కలిసి చుట్టుపక్కల అంతా వెతికాడు.
ఈ క్రమంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద దుర్గాప్రసాద్ కారు కనిపించింది.కారులో వెళ్తున్న దుర్గాప్రసాద్ ను ఆపి మణికంఠ గురించి అడగగా కాస్త కంగారు పడ్డాడు.అందరూ కలిసి గట్టిగా నిలదీయడంతో మణికంఠ తన తాతను తిట్టాడని, దీనిపై తాను నిలదీశానని దుర్గాప్రసాద్ తెలిపాడు.
అప్పుడు నువ్వు ఊర్లో లేని సమయంలో నీ భార్య, పిల్లలను చంపేస్తానని మణికంఠ తనను బెదిరించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో కారుతో తొక్కించి మణికంఠను చంపేశానని చెప్పి దుర్గాప్రసాద్ పారిపోయాడు.
మణికంఠ తండ్రి శ్రీనివాసరావు పోలీసులకు సమాచారం అందించాడు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్మార్టం తరలించారు.పరారీలో ఉన్న దుర్గాప్రసాద్ పై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు సీఐ కిషోర్ బాబు, ఎస్ఐ సతీష్ తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.