ప్రస్తుతం సోషల్ మీడియాకు సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు బాగా కనెక్ట్ అవుతున్నారు.ఇక ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాకు పరిచయమవుతున్నారు.అందులో ఉండే ఎంటర్టైన్మెంట్ ను, ఆసక్తి విషయాలను, అప్ డేట్ న్యూస్ లపై బాగా ఆసక్తి చూపుతున్నారు.
అలాంటి తరుణంలో సోషల్ మీడియాకు ఓ బాలీవుడ్ బ్యూటీ దూరం కానుందట.ఇంతకీ బ్యూటీ ఎవరంటే.
బాలీవుడ్ బ్యూటీ వరీనా హుస్సన్.ఈ బ్యూటీ బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తన నటనతో బాగా ఆకట్టుకోగా ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది.ఇక తన గ్లామర్ విషయంలో యువత మనసులను గెలుచుకుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో తెగ షేర్ చేసుకుంటోంది.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాకు దూరం అవుతున్నా అంటూ పోస్ట్ పెట్టగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ కాగా అందులో ఆమె కొద్ది రోజుల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట.
అభిమానుల ప్రేమ, అభిమానులే తన బలం అంటూ అందుకే ఈ విషయాన్ని తప్పకుండా అభిమానులతో షేర్ చేయాలని అనుకుందట.ఇక సోషల్ మీడియాలో ఇదే నా చివరి పోస్ట్ అంటూ, ఇక తన సినిమా అప్ డేట్స్ ను, మిగతా విషయాలను తన బృందం అప్ డేట్ చేస్తుందని తెలిపింది.
ఇక ఆమె సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ త్రీ సినిమా లో స్పెషల్ సాంగ్ లో చేయగా ప్రస్తుతం పోస్టర్, ఇన్ కంప్లీట్ మ్యాన్ వరుస సినిమాలో నటిస్తుంది.ఇక టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.