సంచలనం: కేవలం 50 రోజుల్లోనే నిందితుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష

కొద్దీ రోజుల క్రితం వరంగల్ లో చోటుచేసుకున్న దారుణ ఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.అభం శుభం తెలియని 9 నెలల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా ఆ చిన్నారి ప్రాణాలను సైతం తీసిన నరరూప రాక్షసుడు,కామపిశాచి ప్రవీణ్.48 రోజుల క్రితం వరంగల్ లో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.ఈ క్రమంలో ప్రవీణ్ ను ఎన్ కౌంటర్ చేయాలని,నడిరోడ్డు పై ఉరితీయాలి అంటూ పలువురు స్థానికంగా నిరసనలు కూడా చేశారు.

 Warangalcourt Sensation-TeluguStop.com

అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కేవలం 48 రోజుల్లోనే ఆ ముద్దాయికి మరణశిక్ష విధించే విధంగా అధికారులు కృషి చేయడం హర్షణీయం అని చెప్పాలి.కేవలం 21 రోజుల్లేనే విచారణ పూర్తి చేసి కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలను ఈ కేసుపై విచారణకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్‌ కోర్టుకు సమర్పించారు.

పోలీసుల చార్జిషీట్‌పై విచారణ చేపట్టిన కోర్టు కేవలం ఘటన జరిగిన 48 రోజుల్లేనే ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

ఈ కేసులో 30 మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించారు.

మొత్తంగా ఈ ఘటన జరిగిన 50 రోజుల్లోనే కేసు దర్యాప్తు చేసి శిక్షను ఖరారు చేయడం తో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కేసు విషయంలో పోలీసులు చూపిన చొరవకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube