కొద్దీ రోజుల క్రితం వరంగల్ లో చోటుచేసుకున్న దారుణ ఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.అభం శుభం తెలియని 9 నెలల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా ఆ చిన్నారి ప్రాణాలను సైతం తీసిన నరరూప రాక్షసుడు,కామపిశాచి ప్రవీణ్.48 రోజుల క్రితం వరంగల్ లో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.ఈ క్రమంలో ప్రవీణ్ ను ఎన్ కౌంటర్ చేయాలని,నడిరోడ్డు పై ఉరితీయాలి అంటూ పలువురు స్థానికంగా నిరసనలు కూడా చేశారు.
అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కేవలం 48 రోజుల్లోనే ఆ ముద్దాయికి మరణశిక్ష విధించే విధంగా అధికారులు కృషి చేయడం హర్షణీయం అని చెప్పాలి.కేవలం 21 రోజుల్లేనే విచారణ పూర్తి చేసి కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలను ఈ కేసుపై విచారణకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సమర్పించారు.
పోలీసుల చార్జిషీట్పై విచారణ చేపట్టిన కోర్టు కేవలం ఘటన జరిగిన 48 రోజుల్లేనే ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
ఈ కేసులో 30 మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించారు.
మొత్తంగా ఈ ఘటన జరిగిన 50 రోజుల్లోనే కేసు దర్యాప్తు చేసి శిక్షను ఖరారు చేయడం తో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కేసు విషయంలో పోలీసులు చూపిన చొరవకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.