నైజాం లో దిల్ రాజుకి షాక్ ఇస్తూ వరుస బడా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వరంగల్ శ్రీను రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాని భారీ రేటుకి కొని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆచార్య అతనికి భారీ లాసులనే మిగిల్చేలా ఉంది.
ఆచార్య పోయినా సరే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా నైజాం రైట్స్ సొంతం చేసుకున్నారట వరంగల్ శ్రీను.పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తే వచ్చే లాభం అంతే ఉంటుంది.
ఒకవేళ సినిమా తేడా కొడితే వచ్చే లాస్ కూడా అంతే ఉంటుంది.ఈ క్రమంలో ఆచార్య లాస్ వచ్చిందని బాధపడకుండా మళ్లీ లైగర్ కోసం భారీ మొత్తాన్ని పెట్టేస్తున్నారట వరంగల్ శ్రీను.
ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే పూరీ జగన్నాథ్.విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది.సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ మూవీపై భారీ అంచనాలు ఏర్పరచింది.ఈ క్రమంలో లైగర్ సినిమాపై ఏపీ, తెలంగాణాలో సూపర్ క్రేజ్ వచ్చింది.
ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫాం లోకి వచ్చిన పూరీ జగన్నాథ్ లైగర్ తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటనున్నాడు.