ఇటీవల వరంగల్ జిల్లా లోని హన్మకొండ లో సభ్య సమాజం తలదించుకునేలా ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.అభం శుభం తెలియని 9 నెలల చిన్నారి ని ఎత్తుకెళ్ళి దారుణానికి ఒడిగట్టి ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన వరంగల్ సైకో ప్రవీణ్ ఆగడాలు,అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అతడి నేరాల చిట్టా చూస్తే మాత్రం హాజీపూర్ సైకో శ్రీనివాస రెడ్డి ని కూడా మించిపోయేలా ఉన్నాయి.పోలీసుల దర్యాప్తులో ప్రవీణ్ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసుల విచారణలో నరరూప రాక్షసుడు ప్రవీణ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావని పోలీసులు చెప్తున్నారు.రిమాండ్ రిపోర్టులో ప్రవీణ్ సంచలన విషయాలు బయటపెట్టాడు.
నిందితుడు ప్రవీణ్ మాములు సైకో కాదని సైకో లను మించిన సైకో అంటూ స్వయంగా పోలీసులే కామెంట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.అతడు ఒక సైకో నే కాకుండా ఒక సెక్స్మానియాక్గా మారాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.
అతడు ఇంటి ఆరు బయట నిద్రించే ఆడవాళ్లనే టార్గెట్ గా ప్రవీణ్ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఇటీవల హన్మకొండ లో 9 నెలల పసికందు అన్న కనికరం కూడా లేకుండా అత్యంత కర్కషంగా పాపను అత్యాచారం చేశాడు.
ప్రవీణ్ ఫిడోఫిలియా అనే జబ్బు తో బాధపడుతున్న ప్రవీణ్ తనతో మత్తు సిరంజి తెచ్చుకొని,ఆరుబయట నింద్రించే ఆడవారిని టార్గెట్ గా వాళ్లపై స్ప్రే చేసి ఇలాంటి దారుణాలకు పాల్పడతాడు.అయితే ఇలాంటి మానసిక వ్యాధి తో బాధపడుతున్న ప్రవీణ్ లాంటి వ్యక్తులు సభ్య సమాజం లో తిరగడం అనేది యమ డేంజర్ అంటూ మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు.మరోపక్క ఈ దారుణం గురించి తెలిసిన ప్రతిఒక్కరూ కూడా ప్రవీణ్ కు ఉరే సరైన శిక్ష అని,అతడిని వదిలిపెట్టకూడదు అంటూ కోరుకుంటున్నారు.