ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి!

వరంగల్ లో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది నడి రోడ్డు మీద ప్రేమించలేదని రవళి అనే అమ్మాయి మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంగతి అందరికి తెలిసిందే.ప్రేమ పేరుతో తిరిగి తనని మోసం చేసిందని కోపంతో ఉన్మాదిగా మారిన అన్వేష్ అనే యువకుడు హన్మకొండ లో నయీం నగర్ లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.

 Warangal Petrol Attack On Girl Died1-TeluguStop.com

ఇక ఆమెని రక్షించడానికి వచ్చిన వారిని కూడా బెదిరింపులకి పాల్పడ్డాడు.దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెని హాస్పిటల్ లో చేర్చారు.

తరువాత ఆమెని ప్రభుత్వం హైదరాబాద్ తరలించి చికిత్స అందించింది.ఇక 70 శాతం కాలిన గాయాలతో 8 రోజులు మృత్యువుతో పోరాడిన రవళి ఈ రోజు ప్రాణం విడిచింది.

ఇక ఆమెని నిప్పు పెట్టి అన్వేష్ ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా అతనిపై హత్యా నేరం నమోదు చేసినట్లు తెలుస్తుంది.ఇక రవళి మృతి వార్త విని ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకి గురవుతున్నారు.

ఇక ఆమెని హత్య చేసిన అన్వేష్ కి ఉరిశిక్ష విధించాలని మహిళా సంఘాలు, విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube