సాంప్రదాయంగా ఉన్న పూలతో బతుకమ్మ ఆడితే ఆ పూలలోని నీటిని శుద్ధి చేసే గుణం ఉంది కాబట్టే మన పూర్వీకులు బతుకమ్మ పండుగ ఆడే వారని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో కమిషనర్,మేయర్, కార్పొరేటర్లు ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు.
కరోనా కారణంగా పండుగ జరుపుకో లేదని ఈ సంవత్సరం మహిళలందరూ సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించాడు అని, తెలంగాణ ఉద్యమంలో మహిళలు బతుకమ్మలు బోనాలతో ఉద్యమించారని, బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణలోనే కాకుండా రాష్ట్రంతో పాటు వివిధ దేశాల్లో కూడా నిర్వహించుకుంటూ ఉన్నారని మేయర్ సుధారాణి తెలిపారు.