తల్లి అంత్యక్రియలకు అని బయలుదేరితే,మృత్యువు కబళించింది

తల్లి అంత్యక్రియలకు అని కొడుకు, కోడలు బయలుదేరి వెళుతుండగా ప్రమాదం రూపంలో మృతువు వారిని కబళించింది.ఈ దారుణ ఘటన తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా లో చోటుచేసుకుంది.

 Warangal Mother Cremation-TeluguStop.com

వివరాల్లోకి వెళితే…వరంగల్ జిల్లా లోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట లో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం లో దంపతులు మృతి చెందారు.

ఆదిలాబాదు లోని తన తల్లి రమణమ్మ శనివారం అనారోగ్యం తో కన్నుమూసింది.అయితే ఆమె అంత్యక్రియల నిమిత్తం కుమారుడు,కోడలు బయలుదేరి కారులో వెళుతుండగా మార్గ మధ్యలో లారీ ఢీ కొనడం తో ఈ ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు.

అయితే మృతులు రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్, అతని భార్య సునీత ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.దీనితో ఆదివారం తల్లికి జరగాల్సిన అంత్యక్రియలు ఆపేయాల్సి వచ్చింది.

Telugu Mother, Telugu Ups, Warangal-

మరోపక్క దంపతుల పోస్ట్ మార్టం అయ్యాక ముగ్గురి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తుంది.పాపం తల్లి అంత్యక్రియలకు అని వెళుతుండగా కొడుకు,కోడలు ఇలా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం తో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube