ఏపీలో మరో 18 నెలల్లో యుద్ధం జరగబోతోందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ అన్నారు.ఈ యుద్ధం మంచికి, చెడుకు మధ్య జరగబోతోందన్నారు.
నిజాయితీకి, వెన్నుపోటుకు మధ్య జరిగే యుద్ధమని తెలిపారు.సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య పోరని పేర్కొన్నారు.2024లో వైసీపీకి ఇంతకు మించిన విజయం ఖాయమని సీఎం జగన్ వెల్లడించారు.ఈ సారి తమ టార్గెట్ 175/175 అన్న జగన్ చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అని వ్యాఖ్యనించారు.
మీకు మంచి జరిగిందో లేదో అన్నది చూసి తనకు అండగా నిలబడాలని చెప్పారు.జగన్ ఏది చెప్పాడో అదే చేస్తాడన్న ఆయన చంద్రబాబును నమ్మొద్దని సూచించారు.