సంక్రాంతి సందర్భంగా జనవరి 13న మొదలైన మెగా మాస్ జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది.ఫ్యామిలీ ఆడియన్స్ కు పూనకాలు ఫుల్ లోడింగ్ అయితే ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో వాల్తేరు వీరయ్య నిరూపించాడు.
దాదాపు వారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ అందుకుంది.ఓవర్సీస్ లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్ల ను అందుకుంది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అమెరికా లోని అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
అమెరికాలోని చాలా రాష్ట్రాలకు చెందిన తన అభిమానులను ఆన్లైన్ ద్వారా కలుసుకొని వారితో చాలాసేపు మాట్లాడారు.చిరంజీవి లైవ్ లో ఉన్నప్పుడే కేక్ కట్ చేసి ఎన్నారై అభిమానులు సెలబ్రేషన్ చేసుకున్నారు.మీ అభిమానం వల్ల నేను ఇంతటి విజయం సాధించాను అంటూ మెగాస్టార్ ఆనందం వ్యక్తం చేశారు.
వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ ఫంక్షన్లో 28 నగరాల్లోని మెగా అభిమానులు పాల్గొనడం ఇదే మొదటిసారి.న్యూ జెర్సీలోని రేగల్ మూవీ థియేటర్ కేంద్రంగా వెంకటరత్న కుమార్ చవ్వకుల, గోపి గుర్రం, శివ సింగరపు ఈ మెగా సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం లో డల్లాస్,ఆస్టిన్, హ్యూస్టన్, సియాటెల్, పోర్ట్ ల్యాండ్, బే ఏరియా, లాస్ ఏంజెల్స్, ఫీనిక్స్, డెన్వర్, చికాగో,సెయింట్ లూయిస్, మిన్నియాపాలిస్, కాన్సాస్ సిటీ, డెట్రాయిట్, కొలంబస్, అట్లాంటా, న్యూజెర్సీ, షార్లెట్, రాలీ, బోస్టన్, టొరంటో, వర్జీనియా, మాంచెస్టర్, ఫిలడెల్ఫియా, పిట్స్బర్గ్, మేరీల్యాండ్, టొరంటో వంటి రాష్ట్రాలతో పాటు కెనడాకు చెందిన మెగా అభిమానులు మెగాస్టార్ తో లైవ్ లో మాట్లాడారు.