దగ్గుబాటి రానా టైటిల్ రోల్ లో నటించిన చిత్రం అరణ్య.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల పనులను పూర్తి చేసుకుని ఉంది.
అయితే 2020 ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని భావించారు చిత్ర బృందం.ఈ సినిమాని తెలుగు, మలయాళం, హిందీ సినిమాలలో ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది.
దాదాపు గడిచిన ఎనిమిది నెలల నుండి ఇప్పటివరకు థియేటర్స్ మూతపడే ఉండడంతో ఈ సినిమాను విడుదల చేయలేకపోయారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ లాక్ లో భాగంగా అక్టోబర్ 15 నుండి థియేటర్స్ ను ఓపెన్ చేశారు.
ఇందులో భాగంగానే అరణ్య చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.ఇన్నాళ్లు జరిపిన నిరీక్షణకు ఎట్టకేలకు ముగింపు లభించింది.
ఇందుకు సంబంధించి తాజాగా హీరో దగ్గుబాటి రానా 2021 సంక్రాంతికి మీ దగ్గర లోని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటూ ఓ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
ఈ సినిమాను ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.
ఈ సినిమాలో దగ్గుబాటి రానాతో పాటు విష్ణువిశాల్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా కథ నేపథ్యం అస్సాంలో జరిగిన నిజమైన సంఘటన నేపథ్యంలో తెరకెక్కింది.
జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.చూడాలి మరి చాలా రోజుల తర్వాత తెరపై కనిపించబోతున్న దగ్గుబాటి రానా ఏవిధంగా మెప్పించగలడో.