పాదయాత్ర అంటే సాధారణంగా అందరికి గుర్తు వచ్చేది రాజకీయ నాయకుల యాత్ర, సినిమా హీరోల విజయ యాత్ర , మొక్కుబడితో దేవాలయాలకు భక్తులు నడుచుకుంటూ వెళ్లే యాత్ర ఇలా రకరకాలుగా ఉంటాయి.అయితే ఇప్పుడు మీరు చదవబోయే యాత్ర అందుకు పూర్తి భిన్నమైన యాత్ర.
తాను ఏది చేసినా అందులో వెరైటీ ఉండాలి అని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి దర్శకుడు రవిబాబు.అందుకే తాను కొత్తగా తీయబోతున్న’అదిగో’ సినిమాలో హీరో పాత్రధారి అయిన పంది పిల్లతో ఇప్పుడు రవి బాబు పాదయాత్ర ప్లాన్ చేసాడు.ఇది ఎప్పుడో కాదు శుక్రవారం శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు .అంతే కాదు ఆసక్తి కలవారు పందితో పాదయాత్రలో పాల్గొనవచ్చు కూడా.హైదరాబాద్ ఫిలిం నగర్ లోని కేబీఆర్ పార్క్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు పాదయాత్ర జరుగుతుంది.
ఆసక్తి కలిగినవారు ఈ యాత్రలో పాల్గోవచ్చని ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది.