టాలీవుడ్ లో రూపొందిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ వద్దకు వెళ్తున్నాయి.బాలీవుడ్ లో రూపొందుతున్న రీమేక్ లు ఒకదాని తర్వాత ఒకటి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.
అందుకే ఎక్కువ సినిమాలు బాలీవుడ్ లో మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి.కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా బాలీవుడ్ కు రీమేక్ కోసం వెళ్తున్నాయి.
బాలీవుడ్ లో ప్రస్తుతం చత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ లో రూపొందుతున్న చత్రపతి సినిమా షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అంటూ స్వయంగా దర్శకుడు వివి వినాయక్ ప్రకటించాడు.తాజాగా ఒక మీడియా సంస్థతో వినాయక్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆయన ముఖ్యంగా తన మనసులో ఉన్న రీమేక్ పై వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది.
వినాయక్ మాట్లాడుతూ తనకు ఇష్టమైన సినిమా సింహాద్రి.
ఆ సినిమాను రీమేక్ చేసేందుకు తాను వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.సింహాద్రి సినిమా ఒక ప్రత్యేకమైన కథ అంటూ చెప్పుకొచ్చాడు.
అవకాశం ఉంటే నేను హిందీలో రీమేక్ చేస్తాను అన్నాడు.చత్రపతి సినిమా రీమేక్ చేసేందుకు పెన్ మీడియా వారు నా వద్దకు వచ్చిన సమయంలో కాదు అనలేక పోయాను.
ఎందుకంటే ఆ బ్యానర్ మరియు హీరో కు నాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అందుకే వారితో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాను.బెల్లంకొండ నటించిన అన్ని సినిమాలు కూడా హిందీలో డబ్బింగ్ అయ్యి యూట్యూబ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కనుక హిందీలో ఆయనకు ఉన్న మార్కెట్ చత్రపతికి ఖచ్చితంగా కలిసి వస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.