టాలీవుడ్ దర్శకులు అప్పుడప్పుడు నటులుగా వెండితెర మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.తమలోని యాక్టింగ్ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో చూసుకోవాలని ప్రయత్నం చేస్తారు.
ఈ ప్రయత్నంలో కొందరు సక్సెస్ అయ్యి పూర్తి స్థాయి నటులుగా మారిపోతారు.ప్రస్తుతం తెలుగులో టాప్ విలన్ గా ఉన్న సముద్రఖని దర్శకుడుగా కోలీవుడ్ లో పరిచయం అయినవాడే.
అలాగే దివంగత దర్శకుడు దాసరినారాయణరావు దర్శకుడుగా ఎంత సక్సెస్ అయ్యాడో నటుడుగా కూడా అంతే సక్సెస్ అయ్యాడు.అలాగే తమిళంలో భాగ్యరాజా కూడా అటు దర్శకుడుగా, ఇటు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యాడు.
అలాగే సీనియర్ కోలీవుడ్ దర్శకులలో చాలా మంది ప్రస్తుతం నటులుగా తమ కెరియర్ ని కొనసాగిస్తున్నారు.అలాగే రచయితలుగా కెరియర్ మొదలు పెట్టి దర్శకులు అయినవారు కూడా ఉన్నారు.
ఇప్పుడు ఈ దారిలో కమర్షియల్ చిత్రాల దర్శకుడుగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వివి వినాయక్ ఇప్పుడు నటుడుగా ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో శీనయ్య అనే సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న అయ్యప్పన్ కోషియమ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వివి వినాయక్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ అనుచరుడుగా వినాయక్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా సాయి పల్లవి నటిస్తూ ఉండగా, రానాకి జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.పవన్ కళ్యాణ్ పాల్గొనే సన్నివేశాలు ప్రస్తుతం పూర్తి చేసే పనిలో దర్శకుడు బిజీగా ఉన్నాడు.