యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ వంటి డైరెక్టర్ వివి వినాయక్.ఈయన ఈమద్య కాలంలో మాత్రం ఆసించిన స్థాయిలో సినిమాలను చేయడంలో విఫలం అవుతున్నాడు.
ముఖ్యంగా ఈయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ లను దక్కించుకోలేక పోతున్నాయి.ఇలాంటి సమయంలో శీనయ్య అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.
గతంలో ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన దర్శకుడు ఒక పుల్ లెంగ్త్ సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమాను దక్కించుకుంటుంది అంటూ వినాయక్ అభిమానులు వెయిట్ చేశారు.
కాని పూర్తిగా తలకిందులు అయ్యింది.ఆయన సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.
ఏంటా అంటూ అనుకుంటూ ఉన్న సమయంలో ఈ సినిమాను క్యాన్సిల్ చేసినట్లుగా చెబుతున్నారు.
సినిమా గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ.తనకు సినిమా అవకాశం ఇచ్చిన దిల్ రాజు నన్ను హీరోగా చూడాలని భావించాడు.ఆయన శీనయ్య సినిమాను నా ముందుకు తీసుకు వచ్చాడు.
కాని సినిమా సరిగా రాకపోవడంతో మద్యలో వదిలేశాం అంటూ వినాయక్ చెప్పుకొచ్చాడు.సినిమా పూర్తి చేస్తే కొద్ది మొత్తంలో అయినా డబ్బు వస్తుంది.
కాని పేరు పోతుందనే ఉద్దేశ్యంతో డబ్బు పోయినా పర్వాలేదు కాని సినిమా ను విడుదల చేయవద్దని అనుకున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి శీనయ్య సినిమా ను మళ్లీ చూడలేము అంటూ క్లారిటీ ఇచ్చేశారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను రాబోయే రోజుల్లో కూడా ప్రారంభించేందుకు సిద్దంగా లేరని తేలిపోయింది.వినాయక్ ప్రస్తుతం చత్రపతి సినిమాకు సిద్దం అవుతున్నాడు.
శీనయ్య సినిమా నుండి గతంలో పోస్టర్ లు కూడా వచ్చాయి.కాని ఆ సినిమా మాత్రం రాకుండా పోయింది.