యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన వివి వినాయక్ ఈమద్య కాలంలో తీవ్రంగా నిరాశ పర్చాడు.మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం.150 మంచి విజయాన్ని సాధించినా కూడా వినాయక్కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.దాంతో సాయి ధరమ్ తేజ్తో ఒక చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఆ సినిమా నిరాశ పర్చింది.ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో వినాయక్తో సినిమా అంటేనే స్టార్స్ కాస్త దూరం జరిగే పరిస్థితి కనిపిస్తుంది.ఇలాంటి సమయంలో వినాయక్ కు ఒకేసారి రెండు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది.మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయబోతున్న లూసీఫర్ రీమేక్ కు మొదట సుజీత్ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది.
కాని ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి పెదవి విరిచాడు.ఇలాంటి రీమేక్ను వినాయక్ అయితే బాగా హ్యాండిల్ చేస్తాడనే నమ్మకంతో చిరంజీవి లూసీఫర్ రీమేక్ బాధ్యతలను ఇప్పటికే ఈ యాక్షన్ చిత్రాల దర్శకుడికి ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది.
చిరంజీవి లూసీఫర్ రీమేక్ ఆఫర్ దక్కిన వినాయక్కు ఇటీవల బాలయ్య నుండి కూడా పిలుపు వచ్చిందట.ఒక మంచి యాక్షన్ కథ ఉంటే సినిమా చేద్దాం అన్నట్లుగా బాలయ్య నుండి మెసేజ్ వచ్చిందని తెలుస్తోంది.ఇటీవల బాలయ్య నుండి వినాయక్ కు కొన్ని ఆయుర్వేదిక్ మందులు అందాయి.కరోనాకు దూరంగా ఉండేందుకు ఆ మందులు ఉపయోగపడుతాయని ప్రచారం జరుగుతుంది.గుర్తు ఉంచుకుని తనకు ఆయుర్వేదిక్ మందులను పంపించినందుకు చాలా సంతోషం అంటూ వినాయక్ అన్నాడు.ఇదే సమయంలో వినాయక్ బాలయ్యల కాంబోలో మరో మూవీ వచ్చే అవకాశం ఉందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.