ప్రస్తుతం యావత్ భారతదేశంలో లాక్డౌన్ అమలులో ఉండటంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.ఈ వైరస్ ప్రభావంతో అన్ని రంగాలు మూతపడ్డాయి.
కాగా సినీ రంగానికి చెందిన పేద కళాకారులు మరియు ఇతర క్రాఫ్ట్లకు చెందిన వారు కూడా పనులు లేక ఖాళీగా మారారు.దీంతో వీరిని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ క్రమంలో డైరెక్టర్ వివి వినాయక్ తనవంతు సాయంగా నటుడు కాదంబరి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న మనం సైతం ఫౌండేషన్కు పేద కళాకారుల సౌకర్యార్థం రూ.5 కోట్లకు విరాళంగా అందించారు.ఈ మేరకు వివి వినాయక్ రూ.5 లక్షల చెక్కును కాదంబరి కిరణ్ కుమార్కు అందజేశారు.సినీ కళాకారుల కోసం ఎవరూ ముందుకు రాకపోవడం శోచనీయం అని వినాయక్ చెప్పుకొచ్చాడు.
ఇదే విధంగా ఇండస్ట్రీలోని మిగతా వారు కూడా పేద కళాకారుల అవసరాలను గుర్తించి తమవంతు సాయం చేయాల్సిందిగా కాదంబరి కిరణ్ కుమార్ కోరారు.
అటు వినాయక్ ప్రస్తుతం శీనయ్య అనే సినిమాలో నటిస్తున్నాడు.కాగా లూసిఫర్ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు వినాయక్ రెడీ అవుతున్నాడు.