కొత్త రాజకీయాలను జనసేన చూపించింది

తాజాగా ఏపీలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో జనసేన ప్రభావం చాలా చూపించాం అంటూ విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థి వీవీ లక్ష్మినారాయణ అన్నారు.ఎన్నికల్లో డబ్బులు పెట్టకుండా ఎలా పాల్గొనాలి, ఎన్నికల్లో డబ్బులకు దూరంగా ఎలా ఉండాలి, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే విషయాలను తాము చూపించాం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

 Vv Lakshmi Narayana About Janasena-TeluguStop.com

తమకు ఎవరు ప్రతినిధిగా ఉండాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయించారు.అయితే వారి నిర్ణయంలో ఖచ్చితంగా తమ ప్రభావం ఉంటుందని ఈ సందర్బంగా ఆయన అన్నాడు.

ఇప్పటి వరకు మూస విధానంలో ఎన్నికలు చూశారు.కాని మొదటి సారి జనసేన కొత్త తరహా ఎన్నికలను జనాల ముందుకు తీసుకు వచ్చింది.

కొత్త రాజకీయాల పట్ల జనాలు ఆసక్తిగా ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలతో వెళ్లడవ్వబోతున్నట్లుగా లక్ష్మినారాయణ అన్నారు.ప్రస్తుతం యువత కొత్త రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నారు.

అది కేవలం జనసేన వల్లే సాద్యం అన్నాడు.

డబ్బులు ఇవ్వకుండా మేము ఓట్లు అడిగాం, మందు ఇచ్చి ఓటు అడగాలని మేము అనుకోలేదు.

ప్రజల్లో ఇంకా ఉన్న నమ్మకంను మేము బతికించే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన అన్నాడు.త్వరలో రాబోతున్న ఎన్నికల ఫలితాలు జనసేన ఏ స్థాయిలో ప్రభావం చూపబోతున్నాయి అనేది వెళ్లడి కాబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube