20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ దర్శనం ఇచ్చిన అరుదైన రాబందు

హైదరాబాద్ ఒకప్పుడు అటవీప్రాంతం అనే విషయం అందరికి తెలిసిందే.ఆ సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల రాబందులు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవి అయితే కాలక్రమంలో హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోవడంతో రాబందులు కూడా పూర్తిగా అంతరించిపోయాయి.

 Vulture Spotted After 20 Years In Hyderabad-TeluguStop.com

ఇక ఈ కాంక్రీట్ జంగిల్స్ ప్రపంచంలో కనుచూపు మేరలో కనీసం పక్షులు కూడా కనిపించడం లేదు.ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో 20 ఏళ్ల తర్వాత రాబందు కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆసిఫ్ నగర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఓ రాబందు ఉందని సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని దానిని పట్టుకొని జూకి తరలించారు.1999లో హయత్ నగర్ అటవీ ప్రాంతం కనిపించిన ఈ తెల్ల రాబందులు తరువాత కనిపించలేదు.అవి అంతరించిపోయాయనే అందరూ భావించారు.అయితే ఇంత కాలం తర్వాత మరల ఇప్పుడు కనిపించడం విశేషం.ఇక ఈ రాబందు చిక్కి శల్యంమై నీరసించి ఉంది.దీంతో కాస్తా సపర్యలు చేసిన అనంతరం రాబందు కొద్దిగా కోలుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube