ప్రభుత్వం వృద్ధులకు అందిస్తున్న ఫించన్ ను కొందరు అధికారులు తప్పుడు లెక్కలు చూపించి డబ్బులు కాజేస్తున్నారు.వృద్ధులకు ఆసరాగా ఉంటుందని ప్రభుత్వం అందించే వృద్ధాప్య ఫించన్ ను కూడా వదలడం లేదు.
ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి.<\br>
తాజాగా కర్నూల్ జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ వృద్ధుడి ఫించన్ ను నొక్కేశాడు.
మద్దికెర మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వాలంటీర్ ప్రవీణ్ ఫించన్ పంపిణీలో అవకతవకలు జరిపాడు.తప్పుడు లెక్కలు చూపి ఓ వృద్ధుడి పింఛన్ ను కాజేశాడు.
ఆ వృద్ధుడు ఎంపీడీఓకు నరసింహమూర్తికి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టాడు.దీంతో తప్పుడు లెక్కలు కనిపించడంతో అతడిని అక్కడిక్కడే సస్పెండ్ చేశారు అధికారులు.
<\br>
గ్రామ వాలంటీర్ రేషన్ కార్డుల మంజూరులో, పింఛన్ అందజేతలో అక్రమార్కులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయడంతో అతడిపై చర్యలు తీసుకున్నామని ఎంపీడీఓ పేర్కొన్నాడు.ఇలాంటి ఘటనలు ఏదో ఓ చోట నెలకొంటున్నాయి.
దీంతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అప్పట్లోనే హెచ్చరించారు.ఈ మేరకు అవినీతికి పాల్పడిన కొందరు అధికారులను సస్పెండ్ చేయగా.
మరికొందరిని పూర్తిగా విధులను బహిష్కరించారు.