చేపలను చూస్తే ఎవరైనా ఏమి చేస్తారు.? లొట్టలు వేసుకుంటూ…కూర వండుకుని తినేస్తారు.అయితే ఇప్పుడు జపాన్ వాసులను మాత్రం ఓ చేప తెగ భయపెట్టేస్తోంది.ఆ చేప అలాంటి ఇలాంటి చేప అయితే కాదు.ఈ చేప కనిపించిన ప్రతిసారి భూకంపం, సునామి వంటి భారీ విపత్తులు ఏర్పడతాయని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు.ఇంతకీ ఆ చేప పేరు ఏంటో చెప్పలేదు కాదు ! దాని పేరు వోర్ ఫిష్.
ప్రస్తుతం వోర్ ఫిష్ జాలర్లకు చిక్కడంతో జపాన్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటివరకు తోయమా సముద్రంలో 7 చేపలను గుర్తించినట్టు జపాన్ జాలర్లు పేర్కొన్నారు.ఏ వోర్ ఫిష్ 3 .2 మీటర్ల పొడవు ఉంటుంది.అయితే ఈ చేప కనిపించడం వలన విపత్తులు జరుగుతాయని నమ్మడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని … ప్రజలు దీని గురించి భయాందోళనలు చెందవద్దని జపాన్ అధికారులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.