మనం ఒక్కోసారి చూస్తూ ఉంటాం మైదానంలో కొంతమంది క్రీడాకారులు ఆడుతూ ఉండగా మరోక్షణంలో మైదానంలోనే ప్రాణాలు వదిలిన వారిని చాలామందిని చూశాం.సరిగ్గా అలాంటి సంఘటన ఒకటి తాజాగా అస్సాం రాష్ట్రంలో జరిగింది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ఒక సందేశం మొత్తం నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయాన తాజాగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.
యువ వాలిబాల్ ఆటగాడు మైదానంలో కుప్పకూలిపోయాడు.అక్కడున్న వారందరూ అతడికి ఏమైందా అని వెళ్ళి చూసే సరికి అక్కడ ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడు.
ఈ సంఘటన అస్సాం రాష్ట్రం లోని కర్బీ అంగ్లాగ్ జిల్లా బోకాజన్ లోని జపరాజాప్ మైదానంలో వాలీబాల్ ఆడుతున్న సమయంలో ఈ సంఘటన సంభవించింది.జాకరియా అనే వాలిబాల్ ఆటగాడు ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు.
కుప్పకూలిపోయిన జాకరియా ను తన సహచరులు పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.అలా రెండు మూడు సార్లు ప్రయత్నం చేసిన అలా కూలబడిపోతున్నాడు సదరు వ్యక్తి.
ఈ సంఘటనతో అక్కడే అతనికి తెలిసిన వ్యక్తులు అతని వద్దకు చేరుకొని పరిశీలించగా గుండెపోటుతో మరణించారు అని తెలిపారు.అయితే ఇది వరకే అతనికి గుండె సంబంధించిన అనారోగ్యం ఉన్నట్లు వారు చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే తన ఫేస్బుక్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నిజంగా ఆ వీడియో చూసినవారు విస్మయానికి గురి కావడం కాయం.అక్కడ ఎలా ఆ వ్యక్తి కూలబడిపోయాడో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.