ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.ఈ అంశంపై కేంద్ర హోంశాఖతో దర్యాప్తు చేయించాలని కోరినట్లు తెలిపారు.
ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటూ… తన గొంతు వినిపిస్తానని పేర్కొన్నారు.ఈ క్రమంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసన్నారు.
అయినా నీతి, నిజాయితీగా బయటకు వచ్చానని స్పష్టం చేశారు.ఆరు నెలల తర్వాత రూరల్ లో చిత్రవిచిత్రాలు చూడాల్సి వస్తుందని వెల్లడించారు.