విశాఖ స్టీల్ ప్లాంట్ లో కలకలం.. ఆ లేఖనే కారణమా.. ?

Vizag Steel Plant Employee Releasing Suicide Note Vizag, Steel Plant, Employee, Suicide Note, Police

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం గాల్లో కలసిపోతున్నట్లుగా ఉంది.కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల ఈ విషయంలో ఏపీలో పెద్ద ఉద్యమమే సాగుతుంది.

 Vizag Steel Plant Employee Releasing Suicide Note Vizag, Steel Plant, Employee,-TeluguStop.com

ఇక పలు కార్మిక సంఘాలు కూడా విశాఖ ఉక్కు పైవేటీకరణను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు గర్జన పేరుతో విశాఖలో కార్మికులు ఈరోజు సాయంత్రం భారీ సభను ఏర్పాటు చేసి, ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ కు చెందిన ఓ కార్మికుడు రాసిన సూసైడ్ నోట్ కలకలం సృష్టించింది.

విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరించేందుకు ఒప్పుకోవద్దని, 32 మంది ప్రాణత్యాగం వలన ఉక్కు పరిశ్రమ వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలని, తన ప్రాణత్యాగంతో ఉక్కు గర్జన ప్రారంభం కావాలని, ఐక్యత పెరగాలని, అందువల్ల ఈ రోజు సాయంత్రం 5:49 గంటలకు ఉక్కు గర్జన ప్రారంభం అయ్యేలోగా ప్రాణత్యాగం చేస్తానని సూసైడ్ నోట్ లో ఆ అజ్ఞాత వ్యక్తి పేర్కొన్నారు.కానీ సూసైడ్ నోట్ రాసి పెట్టిన వ్యక్తి మాత్రం ఎవరన్ని విషయం తెలియరాలేదట.కాగా ఆ వ్యక్తి కోసం పోలీసులు, కార్మికులు గాలిస్తున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube