వైకాపా ఎంపీ నందిగం సురేష్ కొన్ని రోజుల క్రితం అమరావతిలో పర్యటిస్తున్న సందర్బంగా కొందరు రైతులు దాడికి ప్రయత్నించారు.ఆ సమయంలో పోలీసులు మరియు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ నుండి ఎంపీ సురేష్ బయట పడ్డాడు.
తాజాగా ఈ విషయమై ఎంపీ మీడియాతో మాట్లాడుతూ నాపై దాడికి చంద్రబాబు నాయుడు కారణం అంటూ ఈ సందర్బంగా ఆయన అన్నాడు.నారా లోకేష్ మరియు కొందరు తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకుల ఆదేశాల మేరకు నాపై దాడి జరిగిందని ఆయన అన్నారు.
తెలుగు దేశం పార్టీ నాయకులు ఇలా వైకాపా నాయకులపై దాడులు చేయించడం ఆపకుంటే వారికి తగిన శిక్షను ప్రజలే విధిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.నాకు భవిష్యత్తులో ఏ ప్రమాదం జరిగినా కూడా అందుకు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్లదే పూర్తి బాధ్యత అంటూ ఈ సందర్బంగా సురేష్ అన్నాడు.
లోకేష్ తన ఎమ్మెల్యే పదవి కోసం మండలి రద్దును అడ్డుకుంటున్నాడు.చంద్రబాబు నాయుడుకు కొడుకు భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుందని సురేష్ అన్నాడు.