ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పేరును వినియోగించుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో సోషల్ మీడియా ఖాతాలలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి కొందరు మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
కొన్ని రోజుల క్రితం సీరియల్ నటుడు రవికృష్ణ పేరుతో ఒక వ్యక్తి ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి దుండిగల్ ప్రాంతానికి చెందిన ఒక యువతితో తరచూ చాట్ చేసేవాడు.
ఆ తరువాత ఆమె ఫోటోలను తీసుకుని ఆ ఫోటోల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి యువతి నుంచి 2లక్షల రూపాయల 20 వేలు వసూలు చేశాడు.వైజాగ్ కు చెందిన జంబాడ లక్మీ వరప్రసాద్ ఈ మోసానికి పాల్పడ్డాడు.యువతి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా డబ్బులు కావాలని ఆ యువతికి వేధింపులు ఎదురయ్యాయి.
వేధింపులు ఎక్కువ కావడంతో యువతి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు జంబాడ లక్మీ వరప్రసాద్ ను అరెస్ట్ చేశారు.
నిందితునికి కూకట్ పల్లి కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
పోలీసులు అన్ని ఆధారాలను సేకరించి ఛార్జిషీటును దాఖలు చేసిన నేపథ్యంలో సోమవారం రోజు ఈ కేసులో తీర్పు వెలువడింది ఈ ఘటనతో సెలబ్రిటీల పేరును వాడుకుని కొందరు మోసాలు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని ప్రూవ్ అయింది.ఇలాంటి మోసగాళ్ల వల్ల కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలకు చెడ్డ పేరు వస్తోంది.
కొన్ని సందర్భాల్లో నిజానిజాలు తెలియని యువతులు నిజంగా సెలబ్రిటీలే తమతో తప్పుగా ప్రవర్తించారని భావిస్తున్నారు ఇలాంటి కేసుల్లో నిందితులకు శిక్ష పడటం వల్ల భవిష్యత్తులో ఈ తరహా మోసాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది సెలబ్రిటీల పరువు తీస్తున్న ఇలాంటి యువకులను మరింత కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.