రాష్ట్ర విభజన తరువాత ఏపీలో మొదటిసారిగా కొత్త రైలు ప్రారంభం అయింది.విశాఖపట్నం-కొత్త ధిల్లీ సూపర్ ఫాస్ట్ రైలును దిల్లీలోని రైల్ భవన్ లో రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
మంత్రి వెంకయ్య నాయుడు సహా తెలుగు మంత్రులు, ఎంపీలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.విభజన తరువాత ఎపీకి కొత్త రైల్వే జోను రాకపోయినా కొత్త రైలు వచ్చింది.
ఇది పూర్తిగా ఏసీ రైలు.ఇది వారానికి మూడు సార్లు అంటే బుధ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తుంది.ఉదయం 7.45కు విశాఖలో బయలుదేరే ఈ రైలు తెల్లవారి సాయంకాలం 7 గంటలకు దిల్లికి చేరుతుంది.ఆంధ్రాలో 7 స్టేషన్లలో, తెలంగాణలో 5 స్టేషన్లలో ఆగుతుంది.36 గంటల్లో దిల్లీకి చేరుతుంది.వాస్తవానికి విజయవాడ నుంచి దిల్లీకి ప్రతిరోజూ రైలు నడపాలని అనుకున్నారు.రైల్వే బడ్జెట్లో కూడా దీన్ని చేర్చారు.కాని విశాఖ నుంచి నడపాలని అక్కడి నాయకులు డిమాండ్ చేయడంతో అక్కడి నుంచి ప్రారంభించారు.హైదారాబాద్ – ధిల్లీ మధ్య నడుస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ ను నవంబరు 15 నుంచి తెలంగాణా ఎక్స్ప్రెస్ గా వ్యవహరిస్తారు.