వివేకా హత్య కేసులో వైకాపా నాయకుల హస్తం

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసును సీబీఐ విచారించాల్సిందే అంటూ ఆయన కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే.స్థానిక పోలీసులు విచారణ విషయంలో అలసత్వం చూపిస్తున్నారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Vivekanandha Reddy Daughter Write The Ycp Leaders Names In High Court Petition-TeluguStop.com

ప్రభుత్వం కూడా ఈ కేసు విషయంలో చాలా లైట్‌గా వ్యవహరిస్తుందని ఆమె అన్నారు.అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లుగా ఆమె పేర్కొంది.

హైకోర్టులో తన పిటీషన్‌లో తన తండ్రి హత్య కేసులో అనుమానితుల పేర్లను ఆమె పొందుపర్చింది.తనకు అనుమానం ఉంది అంటూ పలువురి వైకాపా నాయకుల పేర్లను ఆమె రాయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

ముఖ్యంగా వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి తండ్రితో పాటు అతడి సన్నిహితుల పేర్లు కూడా ఆమె తెలియజేసింది.వైకాపా నాయకుల హస్తం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేయడం ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది.

హైకోర్టు ఒక వేళ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయంటూ రాజకీయ నాయకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube