ఏపీ లో టోటల్ గా టీడీపీ పార్టీని దాదాపు గా తుడిచిపెట్టేసింది బీజేపీ పార్టీ ఇప్పుడు తెలంగాణా పై తన ఫోకస్ ని పెట్టింది.ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా మాజీ ఎంపీ వివేక్ బీజేపీ గూటికి చేరుకున్నట్లు తెలుస్తుంది.
ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరి, మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్లారు.అయితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం కేసీఆర్ చేతికి పగ్గాలు రావడం తో తిరిగి టీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
అయితే అక్కడ జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు ఆశించిన స్థానాన్ని కేటాయించకపోవడం తో కొంత కాలంగా సంతృప్తి తో ఉన్న వివేక్ టీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
అయితే ఇప్పుడు ఆయన మళ్లీ బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తుంది.ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు.గతంలోనే ఓ సారి అమిత్షాను కలిసిన వివేక్.
అప్పుడే బీజేపీతో చేరతారని ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.
.