కరోనా ప్రభావం ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న విషయం తెలిసిందే.ఎక్కడో చైనా లో మొదలైన ఈ కరోనా వైరస్ నిదానంగా ప్రపంచ దేశాలకు పాకిన విషయం విదితమే.
ఈ కరోనా ప్రభావం తో ఒక్క చైనా లోనే మూడు వేల మందికి పైగా మృతి చెందగా, ప్రపంచ వ్యాప్తంగా 5 వేలకు పైగా మరణాలు నమోదు అయ్యాయి.చైనా తరువాత ఇటలీ,యూరోప్,ఇరాన్ లలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండగా మిగిలిన దేశాల్లో కూడా ఈ కరోనా ప్రభావం తీవ్రతరం అవుతుంది.
ఈ క్రమంలోనే యూరప్ దేశం జర్మనీ లో కూడా కరోనా పంజా విసరడం తో ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించారు.దీనితో ప్రజలు వాళ్ల ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది.
విమాన సర్వీసులు కూడా రద్దు అవ్వడం తో అక్కడ నుంచి ఎవరూ కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.అయితే జర్మనీ లోని బుండెస్లీగా లో చెస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జర్మనీ లోనే చిక్కుకున్నట్లు తెలుస్తుంది.
అక్కడ విమాన సర్వీసులు రద్దు చేయడం తో ఆనంద్ తిరిగి స్వదేశానికి రావడానికి అవాంతరాలు ఎదురయ్యాయి.
దీనితో ఆయన పరిస్థితి కొంచం సర్దుకొనే వరకు ఆయన జర్మనీ లోనే ఉండిపోతారా లేదంటే మరి భారత్ చొరవ తో ఏవైనా చర్యలు చేపడుతుందా అన్న దానిపై క్లారిటీ లేదు.మరోపక్క ఆనంద్ భార్య అరుణ మాట్లాడుతూ ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానని, అయితే కరోనా మరింత విస్తరించకుండా ఇలా విమాన సర్వీసులను రద్దు చేయడం మంచి అంశమే అంటూ ఆమె అన్నారు.మరి విశ్వనాథ్ ఆనంద్ తిరిగి ఎప్పుడు స్వదేశానికి వస్తారు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.