ఇండియా తిరిగి వచ్చిన గ్రాండ్ మాస్టర్

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.దీంతో విదేశాలలో ఉన్న భారతీయులు రెండు నెలల పాటు విమాన సర్వీసులు లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు.

 Viswanathan Anand Returns Home After Quarantine, Lock Down, Corona Effect, Covid-TeluguStop.com

దీనిలో సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఇతర దేశాలలో లాక్ డౌన్ కారణంగా ఉండిపోయారు.అలాగే భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కూడా కరోనా కారణంగా జర్మినీలో చిక్కుకుపోయారు.

లాక్ డౌన్ ప్రకటించకముందు ఓ టోర్నీ ఆడేందుకు యూరప్ వెళ్లిన ఆనంద్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానసర్వీసులు నిలిచిపోవడంతో జర్మనీలో ఉండిపోవాల్సి వచ్చింది.

దాదాపు మూడు నెలలుగా జర్మనీలో కాలం గడిపిన ఆనంద్ ఇటీవలే భారత్ వచ్చాడు.

అయితే ప్రోటోకాల్ ప్రకారం బెంగళూరులో వారం రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని తాజాగా ఇంటికి చేరుకున్నాడు.చెన్నైలో తన నివాసానికి చేరుకున్న వెంటనే ఈ లెజెండరీ ప్లేయర్ తన కుమారుడు అఖిల్ ను చూసి భావోద్వేగాలకు గురయ్యాడు.

సుదీర్ఘ విరామం తర్వాత కొడుకుని చూడడం ఆనందం కలిగిస్తోందని తెలిపాడు.మొత్తానికి ఇతర దేశాలలో చిక్కుకుపోయి ఇండియా వచ్చిన ప్రముఖులు కుటుంబాన్ని చూసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube