ఫలక్నుమా దాస్ హీరో విశ్వక్ సేన్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర గందరగోళంను సృష్టిస్తున్నాయి.
పదే పదే విమర్శల పాలయ్యాడు.గతంలో ఈయన విజయ్ దేవరకొండపై ఏదో కామెంట్ చేయడంతో రౌడీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఆ సమయంలో ఏకంగా ఫలక్నుమా దాస్ పోస్టర్స్ను కూడా చించేయడం జరిగింది.ఆ వివాదం రసాబాసగా మారడంతో అంతా కూడా విశ్వక్సేన్దే తప్పు అన్నారు.
ఇక తాజాగా జనతా కర్ఫ్యూ సందర్బంగా కూడా నోరు జారాడు.బయటకు ఎందుకు వచ్చారంటూ సున్నితంగా మాట్లాడాల్సింది పోయి కాస్త సీరియస్ అయ్యాడు.దాంతో ఆయనపై ఒక వర్గం వారు దుమ్మెత్తి పోశారు.ఇక తప్పదన్నట్లుగా చివరకు క్షమాపణలు చెప్పాడు.ఆ మాట అనకుండా ఉండాల్సింది అంటూ విశ్వక్సేన్ తన వివరణలో క్లారిటీ ఇచ్చాడు.తాజాగా మరోసారి ఈ యువ హీరో నోరు జారి ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాడు.
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎఫ్ 2 చిత్రాన్ని నేను పావుగంట కంటే ఎక్కువ సేపు చూడలేక పోయాను.బూతు కామెడీ పెట్టి కమర్షియల్ సినిమాలకు అర్థం మార్చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తన దృష్టిలో కంచరపాలెం సినిమా మాత్రమే మంచి కమర్షియల్ సినిమా అన్నాడు.ఎఫ్ 2 సినిమాలో ఉన్న కామెడీ ఏమాత్రం బాగాలేదనే అభిప్రాయంను వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఆయనపై సినీ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ సినిమా బాగాలేదు అనడం ప్రేక్షకులను అవమానించడమే.ఎందుకంటే వంద కోట్ల రూపాయలను ఆ సినిమాకు ప్రేక్షకులు కట్టబెట్టిన విషయం ఆయనకు తెలియదా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ నోరు జారితే సీరియస్గా పరిణామాలు ఉంటాయని విశ్వక్సేన్ను కొందరు నెటిజన్స్ హెచ్చరించారు.