తెలుగులో “ఫలక్ నుమా దాస్” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ పరిశ్రమకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్య కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటి పట్టునే ఉన్నటువంటి విశ్వక్ సేన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు.
ఇందులో భాగంగా సమాజంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి స్పందిస్తున్నాడు.
అయితే గత కొద్దికాలంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతూ సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
దీంతో తాజాగా ఈ విషయంపై విశ్వక్ సేన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించాడు.ఇందులో భాగంగా రోజు రోజుకి దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని ప్రస్తుతం 85 రూపాయలు ఉందని అలాగే శ్రీలంక దేశం లో 55 రూపాయలు మాత్రమే ఉందని తెలిపాడు.
అంతేకాక ఇక్కడ విచిత్రమేంటంటే శ్రీలంక దేశం మన దేశంతో పెట్రోలు కొనుక్కుంటుందని అయినప్పటికీ అక్కడ మనకంటే 35 రూపాయలు తక్కువ రేటు ఉంటుందని తెలిపాడు.దీంతో కొందరు విశ్వక్ సేన్ తెలిపినటువంటి ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విశ్వక్ సేన్ ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న “పాగల్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా నటించినటువంటి “హిట్” అనే చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.
దీంతో తన తదుపరి చిత్రంతో తన హిట్ ట్రాక్ ని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.