ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమా దాస్ చిత్రాలతో ప్రేక్షకులకి చేరువైన నటుడు విశ్వక్ సేన్.తెలంగాణలో విజయ్ దేవరకొండ తర్వాత మరో మంచి నటుడుగా విశ్వక్ ఏమర్జ్ అవుతున్నాడు.
అతని హీరోగా చేసిన ఫలక్ నుమా దాస్ ఓ మలయాళీ సినిమాకి రీమేక్ గా తన సొంత ప్రొడక్షన్ లోనే తానే దర్శకుడుగా మారి తెరకెక్కించాడు.ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం తరువాత నాని ప్రొడక్షన్ లో హిట్ అనే క్రైమ్ థ్రిల్లర్ తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
టైటిల్ కి తగ్గట్లే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.ఇక విశ్వక్ తో హిట్ సీక్వెల్ తీసే ప్లాన్ లో నాని ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ కుర్ర హీరో తనకి సరిపోయే కథలని ఎంచుకుంతూ రెగ్యులర్ హీరోలకి భిన్నమైన మార్గంలో వెళ్తున్నాడు.
ఎవరు చిత్రం తర్వాత హిట్ కొట్టిన నిర్మాత పీవీపీ మళ్ళీ చిన్న సినిమాతోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యారు.
ఓ మై కడవులే అనే తమిళ సినిమా రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారు.ఈ సినిమాని విశ్వక్ సేన్ తో చేయడానికి నిర్మాత పీవీపీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
విశ్వక్ సేన్ అయితే తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తి చేయొచ్చని భావించిన పీవీపీ ఈ సినిమా విషయమై చర్చలు కూడా జరిపినట్జలు సమాచారం.వీలైతే అతనికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం.
అన్ని అనుకూలంగా జరిగితే త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.