తమిళనాడుకే పరిమితం అనుకుంటున్న యాంటీ ఫ్యాన్స్ మెల్ల మెల్లగా టాలీవుడ్లో కూడా ఏర్పాటు అవుతున్నారు.ఒకప్పుడు తమ అభిమాన హీరో వస్తే చూసి ఈలలు గోలలు చేసేవారు.
కాని ఇప్పుడు తమ అభిమాన హీరోకు పోటీ అనుకున్న హీరో వస్తే విమర్శలు చేయడం మొదలు పెట్టారు.యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెనింగ్ చేస్తూ తమ అభిమాన హీరోకు పోటీ అనుకున్న హీరో సినిమాలు ఆడకుండా చేస్తున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విశ్వక్సేన్ తాజా చిత్రం ‘పలక్నుమాదాస్’ చిత్రంను ట్రోల్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
కావాలని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తన సినిమాను ట్రోల్ చేస్తున్నారని, నెగటివ్ టాక్ వ్యాప్తి చెందేలా చేస్తున్నారంటూ స్వయంగా విశ్వక్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఆమద్య విజయ్ దేవరకొండ గురించి ఈయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు ఆయన సినిమాను రౌడీ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు.సోషల్ మీడియాలో ఫలక్నుమాదాస్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో సినిమాకు చాలా నష్టం జరిగింది.
కనీసం సినిమా మల్టీప్లెక్స్లలో అయినా నడుస్తుందని భావిస్తే అక్కడి వారికి సోషల్ మీడియా ద్వారా తప్పుడు సంకేతాలు ఇవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ మీడియా ముందుకు వచ్చి తన సినిమాను ట్రోల్ చేసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతు చూస్తానంటూ హెచ్చరించాడు.
దాంతో రౌడీ ఫ్యాన్స్ మరింతగా రెచ్చి పోవడంతో చివరకు మళ్లీ విశ్వక్సేన్ సారీ చెప్పాల్సి వచ్చింది.విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు విశ్వక్ సేన్ సారీ చెప్పిన నేపథ్యంలో గొడవ సర్దుమనిగినట్లే అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు.
మరి విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ల మద్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయం కాలమే తెలియజేయాల్సి ఉంది.