కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు మెల్ల గా ఓపెన్ అయ్యాయి.గత నెలలో చివరి వారంలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అందులో సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఆ సినిమా తో పాటు ఇష్క్ కూడా వచ్చింది.
రెండు సినిమాల్లో తిమ్మరుసుకు పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చినా కూడా వసూళ్ల పరంగా మాత్రం నిరాశ పర్చింది.ఆ తర్వాత వారం అంటే మొన్న శుక్రవారం ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా రోజులు అయినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు పాజిటివ్ గానే రెస్పాన్స్ వచ్చింది కాని కోటి వసూళ్లు అయ్యే పరిస్థితి కూడా లేదు.
సినిమాలు బాగుంటున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడం లేదు.అసలు సినిమాలను జనాలు మర్చి పోయారా అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.పెద్ద సినిమాలు వచ్చినప్పుడు అయినా సినిమాను చూసేందుకు జనాలు క్యూ కడతారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో ఈ వారంలో విశ్వక్ సేక్ హీరోగా నివేతా పేతురాజ్ ఇంకా ప్రముఖులు నటించిన పాగల్ సినిమా విడుదల కాబోతుంది.
సినిమా కు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న కారణంగా బజ్ అయితే బాగానే ఉంది.కాని జనాలు ఈ సినిమాతో అయినా థియేటర్ల రూటుకు వస్తారా అంటే అనుమానమే అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది.కనుక సినిమా పై హోప్స్ అయితే బాగానే పెరుగుతున్నాయి.మరి పాగల్ సినిమా ను ప్రేక్షకులు చూసేందుకు వస్తారా రారా అనేది మరో మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.