విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నరేష్ కుప్పిలి డైరక్షన్ లో వచ్చిన సినిమా పాగల్.బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పించారు.
ఆగష్టు 14న రిలీజై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న పాగల్ సినిమా థియేట్రికల్ హిట్ అందుకుందని చెప్పొచ్చు.ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ, కేవలం 3 షోస్ మాత్రమే వేస్తున్నా సరే పాగల్ చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలో పాగల్ సినిమా థియేట్రికల్ రిలీజై 20 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు.
అమేజాన్ ప్రైం ఈ సినిమా డిజిటల్ రైట్స్ మంచి రేటుకి కొనేసిందని తెలుస్తుంది.
ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 3న అమేజాన్ ప్రైం లో పాగల్ రిలీజ్ చేస్తారని అంటున్నారు.దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేట్రికల్ రిలీజ్ లో మంచి లాభాలు తెచ్చుకున్న సినిమాల్లో పాగల్ ఒకటని చెప్పొచ్చు.మరి ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
విశ్వక్ సేన్ పాగల్ సినిమాలో నివేదా తో పాటుగా సిమ్రన్ చౌదరి, మేఘా లేఖ హీరోయిన్స్ గా నటించారు.