తక్కువ సినిమాల్లోనే నటించినా నటుడిగా విశ్వక్ సేన్ మంచి పేరును సొంతం చేసుకున్నారు.ఫలక్ నమా దాస్,హిట్ సినిమాలు సక్సెస్ కావడంతో పాటు నటుడిగా విశ్వక్ సేన్ మార్కెట్ ను పెంచాయి.
ప్రస్తుతం విశ్వక్ సేన్ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ఓ మై కడవలే మూవీ రీమేక్ లో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తి కాగా కరోనా కేసులు తగ్గితే ఈ ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన విశ్వక్ సేన్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలను చెప్పుకొచ్చారు.కరోనా సెకండ్ వేవ్ గురించి చెప్పాలని ఒక నెటిజన్ విశ్వక్ సేన్ ను కోరగా కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరొక నెటిజన్ విశ్వక్ సేన్ ను క్రష్ గురించి ప్రశ్నించారు.ఆ ప్రశ్నకు విశ్వక్ సేన్ తెలుగులో ఒక వెలుగు వెలిగి టాలీవుడ్ కు దూరమైన గోవా బ్యూటీ ఇలియానా పేరును చెప్పారు.
సాధారణంగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత క్రష్ విషయంలో హీరోల అభిప్రాయాలు మారతాయి.కానీ విశ్వక్ సేన్ మాత్రం సినిమా రంగంలో హీరోగా సెటిల్ అయినా క్రష్ విషయంలో మాత్రం తన అభిప్రాయం మారలేదని చెబుతుండటం గమనార్హం.కరోనా విజృంభణ వల్ల పాగల్ ట్రైలర్ రిలీజ్ కు ఆటంకాలు ఎదురవుతున్నాయని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.
లాక్ డౌన్ నిబంధనలు అమలు కావడానికి ముందు తాను పని గురించి ఎక్కువగా ఆలోచించేవాడినని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.
కొందరు నెటిజన్లు పెళ్లికి సంబంధించి ప్రశ్నలు వేయగా సంబంధాలు ఉంటే చెప్పాలంటూ రివర్స్ లో నెటిజన్లకే విశ్వక్ సేన్ ప్రశ్నలు వేయడం గమనార్హం.