2024లో బీజేపీ-జనసేన సత్తా చూపిస్తుంది! విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు

ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి జట్టు కట్టిన బీజేపీ, జనసేన పార్టీలు తమ కార్యాచారణకి రంగం సిద్ధం చేసుకున్నాయి.ఇందులో భాగంగా ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టారు.

 Vishnu Vardhan Reddy Pawan Kalyan Bjp Janasena-TeluguStop.com

దాంతో పాటు అధికార పార్టీపై పోరాటాన్ని కూడా కలిసి చేయడానికి ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారు.ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ-జనసేన కలయికపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ ని వాడుకొని వదిలేసిన కమ్యూనిస్ట్ నేతలు ఇప్పుడు తమతో జనసేనాని పొత్తు పెట్టుకుంటే ఎందుకు అంతగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

మూడు రాజదానులపై జగన్ నిర్ణయం సరైన విధంగా లేదని అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ-జనసేన సత్తా చూపడంతో పాటు 2024లో పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చూపిస్తామని అన్నారు.అలాగే రాబోయే ప్రభుత్వం బీజేపీ-జనసేనదే అని అన్నారు.

మొత్తానికి మొన్నటి వరకు జనసేన పార్టీ అంటే విమర్శలు చేసే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పొత్తు ధర్మం అనుసరించి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారా, లేక ఈ పొత్తుని స్వాగాతిస్తున్నారా అనేది అర్ధం కాని విషయంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube