ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి జట్టు కట్టిన బీజేపీ, జనసేన పార్టీలు తమ కార్యాచారణకి రంగం సిద్ధం చేసుకున్నాయి.ఇందులో భాగంగా ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టారు.
దాంతో పాటు అధికార పార్టీపై పోరాటాన్ని కూడా కలిసి చేయడానికి ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారు.ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ-జనసేన కలయికపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ని వాడుకొని వదిలేసిన కమ్యూనిస్ట్ నేతలు ఇప్పుడు తమతో జనసేనాని పొత్తు పెట్టుకుంటే ఎందుకు అంతగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
మూడు రాజదానులపై జగన్ నిర్ణయం సరైన విధంగా లేదని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ-జనసేన సత్తా చూపడంతో పాటు 2024లో పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చూపిస్తామని అన్నారు.అలాగే రాబోయే ప్రభుత్వం బీజేపీ-జనసేనదే అని అన్నారు.
మొత్తానికి మొన్నటి వరకు జనసేన పార్టీ అంటే విమర్శలు చేసే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పొత్తు ధర్మం అనుసరించి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారా, లేక ఈ పొత్తుని స్వాగాతిస్తున్నారా అనేది అర్ధం కాని విషయంగా ఉంది.