ఇండస్ట్రీలో తొమ్మిది వందల మందికి చెందిన మా అధ్యక్ష ఎన్నికలు తెలుగు రాష్ట్రాలలో మరింత హీట్ పుట్టిస్తున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మీడియా చానల్స్.
కవరింగ్ ఎక్కువైపోయింది. అక్టోబర్ 10 వ తారీఖున “మా” అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.
ఇటువంటి తరుణంలో పోటీదారుల లో ఒకరు మంచు విష్ణు తాజాగా మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
మేనిఫెస్టో రిలీజ్ చేసిన మంచు విష్ణు మాట్లాడుతూ.
నాకు ప్రధానమంత్రి మోడీ తో కూడా చనువు ఉంది.అపాయింట్మెంట్ అడిగితే ఎవరికి దక్కుతుందో అందరికీ తెలుసు.
అంటూ మీడియా ఒక ప్రశ్న వేసిన టైంలో విష్ణు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.విష్ణు మేనిఫెస్టోలో మా అధ్యక్ష భవనం తన సొంత డబ్బులతో నిర్మించనున్నట్లు అదేరీతిలో.
మా యాప్ మా అసోసియేషన్ పిల్లల చదువులకు ఆర్ధిక సహకారంతో పాటు.ప్రతి ఒక్కరికి ఫ్రీగా మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.