ఎవరైనా తన తండ్రి జ్ఞాపకార్థం చిన్న నిర్మాణ గృహం కట్టిస్తాడు, లేదంటే ఏదైనా మంచి పని చేస్తాడు.అంతగా డబ్బు ఉన్న వారు అయితే ఏదైనా చారిటీ కార్యక్రమం చేస్తారు.
కాని అది ఎన్నో ఏళ్లు సాగదు.తండ్రిపై అభిమానంతో ఈ వ్యక్తం 14 సంవత్సరాల నుండి పేద వారికి సేవ చేస్తూనే ఉన్నాడు.
అన్నదానం చేస్తూ రోజుకు దాదాపుగా నాలుగు వందల మంది పొట్ట నింపుతున్నాడు.ఉత్తర ప్రదేశ్కు చెందిన విశాల్ చేస్తున్న ఈ పనిని స్థానికులతో పాటు లక్సో వాసులు అంతా కూడా అభినందిస్తూనే ఉన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం విశాల్ తండ్రి విజయ్ సింగ్ మృతి చెందారు.ఆయన జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని భావించిన విశాల్ సింగ్ తన తండ్రి చనిపోయిన సమయంలో తాము పడ్డ ఇబ్బంది మరెవ్వరు పడొద్దని భావించాడు.విజయ్ సింగ్ హాస్పిటల్లో ఉన్న సమయంలో ఆయన వద్ద ఉన్న వారు తినేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.స్థానికంగా హోటల్స్ ఉండవు, దూరంగా ఉన్న హోటల్స్లో వెళ్లి తినాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.దాంతో తన తర్రడి హాస్పిటల్లో ఉన్న సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు మరెవ్వరు ఎదుర్కోవదని విశాల్ సింగ్ నిర్ణయించుకున్నాడు.
లక్నో లోని బలంపూర్ హాస్పిటల్లో వందలాది మంది పేద రోగులు చికిత్స పొందుతూ ఉంటారు.వారికి హాస్పిటల్ సిబ్బంది బోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు.కాని వారి పక్కన ఉండే వారు మాత్రం బయటే తినాల్సి ఉంటుంది.
అలాంటి వారు తినడానికి ఇబ్బంది లేకుండా విశాల్ సింగ్ ప్రతి రోజు మద్యాహ్నం సమయంలో బోజన సదుపాయం ఏర్పాటు చేశారు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వందలాది మంది ఈ బోజనంను తింటూ ఉంటారు.
హాస్పిటల్ సిబ్బంది కొందరు సాయం చేయడంతో అక్కడే బోజన హాలును ఏర్పాటు చేయడం జరిగింది.అన్నదానం చేసే విశాల్ ఏదో సాదా సీదాగా ఆ పని చేయడు.
తిన్నవారు ఇంట్లోకంటే బాగా తిన్నాం అనుకునేలా మంచి ఆహార పదార్థాలు వడ్డిస్తాడు.
ఎన్ని వందల కోట్లు సంపాదించినా కూడా విశాల్ సింగ్కు వచ్చిన మంచి పేరు రాకపోవచ్చు.స్థానికంగా విశాల్ సింగ్ను ఒక గొప్ప మనిషిగా ప్రజలు గుర్తిస్తారు.బతకడం పెద్ద గొప్ప పని కాదు, కాని విశాల్ సింగ్లా బతికి నలుగురితో మంచి అనిపించుకోవడం గొప్ప.
మనసు వసతులు ఉన్నా కూడా పెట్టలేని పరిస్థితి.కొందరు వసతులు లేకున్నా పెట్టాలనుకుంటారు.
రెండో రకం వ్యక్తి విశాల్ సింగ్.తండ్రి ఆత్మకు సంపూర్ణ శాంతి కలిగించిన ఆ కొడుకు లాంటి కొడుకు తమకు ఉంటే బాగుండు అంటూ ప్రతి ఒక్క వృద్ద దంపతులు అనుకుంటారు.