తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం యాక్షన్ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వస్తున్న నేపథ్యంలో హీరో విశాల్ తన తదుపరి చిత్రాలను లైన్లో పెట్టాడు.
ఇప్పటికే డిటెక్టివ్ సీక్వెల్ను రెడీ చేస్తున్న విశాల్ ఆ తరువాత తన నెక్ట్స్ మూవీ ఏమిటనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
తమిళ దర్శకుడు ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కించేందుకు విశాల్ రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాకు ‘చక్ర’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.ఈ సినిమాలో అందాల భామలు రెజినీ క్యాసండ్రా, శ్రద్ధా శ్రీనాథ్లు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
వీటితో పాటు మరికొన్ని సినిమాలను క్యూలో పెట్టిన విశాల్ వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
కాగా చక్ర సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా మొదలుపెట్టడమే కాకుండా అంతే త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై తానే స్వయంగా ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు.ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.