విశాల్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.అలాగే తమిళ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ ప్యానల్ లో విశాల్ కీలక పదవులలో కొనసాగుతున్నారు.
తమిళ రాజకీయాలలో కూడా విశాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.విశాల్ హీరోగా తెరకెక్కే సినిమాలకి అతనే నిర్మాతగా ఉంటాడు.
చాలా వరకు బయటి ప్రొడక్షన్స్ కి దూరంగా ఉంటాడు.ఇక తన సినిమాల కోసంవిశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని నడుపుతున్నాడు.
ఈ మధ్య విశాల్ సైబర్ ఆర్ధిక నేరాల నేపధ్యంలో అభిమన్యుడు, తాజాగా చక్ర సినిమాలు తీసాడు.అయితే అతని ఫిల్మ్ ఫ్యాక్టరీలో జరుగుతున్నా ఆర్ధిక నేరాన్ని గుర్తించడానికి చాలా సమయం తీసుకున్నాడు.
ఈ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ మహిళే ఈ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది.ఆరేళ్లుగా విశాల్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఆమె పలు దఫాల్లో కోట్లు కొల్లగొట్టినట్టు తెలిసింది.
ఇటీవలే ఆమె 45 లక్షలు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేయడంతో ఆమెపై అనుమానం కలిగింది.డబ్బులు మాయంపై విచారణ జరిపిన విశాల్ కు ఈ మహిళనే చాలా రోజులుగా కాజేస్తోందని ఆడిటింగ్ లో తేలడంతో వెంటనే విశాల్ ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ మహిళ మోసం బయటపడింది.నిర్మాతగా చాలా ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ బిజినెస్ మెన్ గా కూడా తన మార్క్ చూపిస్తున్న విశాల్ ని ఒక మహిళ మోసం చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.