తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చక్ర’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది.పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎంఎస్ ఆనందన్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా ట్రైలర్ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్ ఉండటంతో వారు దీన్ని పదేపదే చూస్తున్నారు.
కాగా ఈ ట్రైలర్ చూస్తుంటే ఇదొక రాబరీ సబ్జెక్ట్తో తెరకెక్కిన చిత్రమని తెలుస్తోంది.
ఇందులో టెక్నాలజీ సాయంతో డిజిటల్ ఇండియా అనే ముసుగులో బ్యాంకుల్లో చోరీ చేస్తుంటాడు విలన్.అయితే ఈ చోరీలకు సంబంధించిన అసలు సూత్రధారి ఎవరనే విషయాన్ని కనుగొనేందుకు మిలిటరీ ఆఫీసర్ చక్ర రంగంలోకి దిగుతాడు.
ఆయనకు సాయం చేస్తుంటుంది శ్రద్ధా శ్రీనాథ్.ఇక ఈ క్రమంలో విశాల్ చేయబోయే యాక్షన్ ఓ రేంజ్లో ఉండబోతుందని చిత్ర ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో డిజిటల్ ఇండియా తన కల అని చెప్పిన క్లిప్పింగ్ను కూడా ఇందులో చూపించారు.మొత్తానికి అదిరిపోయే కాన్సెప్ట్తో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాతో విశాల్ మరోసారి ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంఎస్ ఆనందన్ చాలా స్టైలిష్గా తెరకెక్కించగా విశాల్ తన సొంత బ్యానర్పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఇక సౌత్లో నాలుగు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు విశాల్ ప్లాన్ చేస్తున్నాడు.
మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.