విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సినిమా చక్ర.సైబర్ నేరాల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.ఇందులో విశాల్ ఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు.సొసైటీలో జరిగే సైబర్ నేరాలకి పాల్పడుతున్న వ్యక్తులని హీరో ఎలా నియంత్రించాడు అనే ఎలిమెంట్ తో సినిమా కథ నడుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సినిమా మీద అంచనాలు పెంచింది.ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా రెజినా కాసండ్రా నెగిటివ్ రోల్ కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.
అయితే విలన్ ఎవరనేది మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కూడా ఒటీటీ రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇప్పటికే హిందీతో పాటు, సౌత్ లో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని కూడా ఓటీటీ బాట పట్టాయి.ఈ నేపధ్యంలో విశాల్ చక్రకి కూడా జీ5 చానల్ నుంచి మంచి రేటు రావడంతో డిజిటల్, శాటిలైట్ రైట్స్ రెండూ కలిసి ఇచ్చేసినట్లు తెలుస్తుంది.
దీనికోసం ఈ చానల్ ఎక్కువ మొత్తంలోనే చెల్లించినట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలలో జీ5 ఒటీటీ రిలీజ్ కి రంగం సిద్ధం చేసింది.
దీపావళి పండుగ కి సినిమా రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలో దానికి సంబంధించి డేట్ కన్ఫర్మ్ చేసి అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.