విశాఖపట్టణం జిల్లా సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి.దీంతో పడవలో ఎనిమిది మంది గల్లంతు కాగా వారి లో చిన్నారి మృతదేహం బయటపడింది.
మొత్తం 11 మంది ప్రయాణించిన ఈ పడవలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.దీంతో ఎనిమిది మంది గల్లంతు కావడంతో … వారిలో చిన్నారి మృతదేహం లభించడంతో మిగతా వారిని గాలించడం కోసం… గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.
వీళ్లంతా వలస కూలీలు అని సమాచారం.ఒడిషా నుండి హైదరాబాద్ కూలిపనులకు.వచ్చిన నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా … తిరిగి సొంత ఇళ్లకు బయలుదేరిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం జరిగిందట.దీంతో గల్లంతైన మిగతా వారి కోసం… గాలింపు చర్యలు స్టార్ట్ చేశారు.
పడవ ప్రమాదానికి గల కారణం… అధిక లోడ్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నాటు పడవలలో పరిమితికి మించి ఎక్కువ మంది ఎక్కడం తోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
అంతేకాకుండా గల్లంతయిన వారు మల్కన్ గిరి జిల్లా కెందు గూడ గుంట వాడ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.