విశాఖ జిల్లాలో విషాదం రెండు నాటు పడవలు బోల్తా..!!

విశాఖపట్టణం జిల్లా సీలేరు నదిలో రెండు నాటు పడవలు  బోల్తా పడ్డాయి.దీంతో పడవలో ఎనిమిది మంది గల్లంతు కాగా వారి లో చిన్నారి మృతదేహం బయటపడింది.

 Vishakapatnam Boat Accident In Sileru River, Sileru River Accident, Vishakapatan-TeluguStop.com

మొత్తం 11 మంది ప్రయాణించిన ఈ పడవలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.దీంతో ఎనిమిది మంది గల్లంతు కావడంతో  … వారిలో చిన్నారి మృతదేహం లభించడంతో మిగతా వారిని గాలించడం కోసం… గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.

వీళ్లంతా వలస కూలీలు అని సమాచారం.ఒడిషా నుండి హైదరాబాద్ కూలిపనులకు.వచ్చిన నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా … తిరిగి సొంత ఇళ్లకు బయలుదేరిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం జరిగిందట.దీంతో గల్లంతైన మిగతా వారి కోసం… గాలింపు చర్యలు స్టార్ట్ చేశారు.

పడవ ప్రమాదానికి గల కారణం… అధిక లోడ్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నాటు పడవలలో  పరిమితికి మించి ఎక్కువ మంది ఎక్కడం తోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

అంతేకాకుండా గల్లంతయిన వారు మల్కన్ గిరి జిల్లా కెందు గూడ గుంట వాడ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube