కరోనా వైరస్.ప్రపంచ దేశాల ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంకా ఈ వైరస్ కారణంగా ఎంతోమందికి ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు.లక్షలు సంపాదించే వారు కూడా కరోనా కారణంగా ఆర్ధిక సమస్యలు ఎదర్కొంటున్నారు.
కరోనా కారణంగా ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే.కొందరు వ్యాపారులు ఇదే సమయంగా సంపాదించేస్తున్నారు.
కొందరు మాస్కులపై భారీగా డబ్బులు సంపాదిస్తే మరికొందరు టాబ్లెట్స్ పై డబ్బులు సంపాదిస్తున్నారు.మరికొందరు మూఢనమ్మకాల మీద ఈ పూజ చేస్తే కరోనా రాదు ఆ పూజ చేస్తే రాదు అంటూ పూజలు చేస్తున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా భయాన్ని అనంతపురంలో కొందరు వ్యాపారాలు క్యాష్ చేసుకుంటున్నారు.
మెడ్ ఇన్ జపాన్ ”వైరస్ షట్ ఔట్” పేరుతో తయారైన కార్దులు మేడలో వేసుకొంటే చుట్టూ ఒక మీటర్ వరకు కరోనా దగ్గరకి రాదని గుంతకల్లులో ప్రచారం చేస్తున్నారు.300 రూపాయలకు అమ్ముతున్న ఈ కార్దు ఒక నెల పని చేస్తుందని, ఇందులో ఉన్న సోడియం క్లోరైడ్, న్యాచురల్ జియోలైట్ రసాయన మిశ్రమం శరీరానికి రక్షణ ఇస్తుందంటూ జనాలను నమ్మిస్తున్నారు.